Thursday, September 04, 2008

హైదరాబాద్ తెలంగాణ ప్రజల సొత్తే - డి.కె. సమరసింహారెడ్డి




తెలంగాణ ప్రజల స్వేదసౌధం- హైదరాబాద్. భిన్న సంస్క­ృతులతో పరిమళించే కుసుమం. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ఈ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే ప్రతిపాదన ఒక దుర్మార్గమైన ఆలో చన. తెలంగాణ ప్రజలను మరోసారి దగా చేయడానికి ఆంధ్ర ప్రాంత నాయకులు పన్నుతున్న కుట్రగా దీనిని భావించ వచ్చు. హైదరాబాద్ నగరం ఈనాటిదా? 400 సంవత్సరా లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన అతి గొప్ప నగరమది. కుతు బ్‌షాహి నవాబులు నిర్మించిన ఈ నగరం తొలుత చించలం (ఇప్పుడు శాలిబండ) పేరుతో చిన్న గ్రామంగా ఉండేది. 1590లో కలరా మహమ్మారి సోకి గోల్కొండ నగరం అత లాకుతలమయింది. నవాబ్ కులీ కుతుబ్ షా అక్కడి నుంచి చించలం గ్రామానికి తరలి వచ్చి తాత్కాలికంగా బస చేశా డు. వ్యాధి బెడద తగ్గిన తరువాత తిరిగి గోల్కొండ వెళుతూ తన బసకు గుర్తుగా 1591లో చార్మినార్ నిర్మించాడు. ఆ తర్వాత 1594లో నాల్గవ ఖలీఫా హజరత్ హైదర్ అలీ పేరిట నగరం నిర్మించాడు. అప్పటినుండి కాలక్రమంలో అంచెలం చెలుగా ఎదిగి హైదరాబాద్‌గా పరిణతి చెందింది.
17వ శతాబ్దంలో హైదరాబాద్‌ను సందర్శించిన ఇటాలి యన్ యాత్రికుడు టావెర్నియర్ నగరంలోని ఉద్యానవన ముల శోభకు అమితంగా ముగ్ధుడయ్యాడు. హైదరాబాద్ నిజానికి 'బాగ్‌నగర్' అని శ్లాఘించాడు. అయితే చివరి నిజాం కాలంలో ఆంధ్రోద్యమం ప్రభవించినప్పుడు కొందరు 'బాగ్ నగర్' పదాన్ని 'భాగ్యనగర్'గా మార్చి వేశారు. అసలు భాగ్యనగర్ అనే పేరు హైదరాబాద్‌కు ఎప్పుడూ లేదని ప్రముఖ చరిత్రకారుడు హెచ్. కె. శేర్వాని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు వాస్తవంగా 'భాగ్యనగర్' అనే పేరు ఎప్పుడూ లేదు. ఉద్యాన వనాలకేకాక సరస్సులకు కూడా హైదరాబాద్ పెట్టింది పేరు. కనుకనే 'సిటీ ఆఫ్ లేక్స్'గా కొందరు విదేశీయాత్రికులు ప్రస్తు తించారు. భారతావనిలో కెల్లా ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, నిర్మలమైన నీటి వసతి, సారవంతమైన నేల లతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే నగరమనిప్రఖ్యా త పర్షియన్ చరిత్రకారుడు ఫెరిస్తా అభివర్ణించారు. ఇంతెం దుకు 'లండన్‌తో విసుగెత్తిన వారు జీవితంతో కూడిన విసు గెత్తినట్లేనని' ప్రముఖ ఆంగ్ల పండితుడు శ్యామూల్ జాన్సన్ చెప్పిన మాటలు హైదరాబాద్‌కు కూడా అక్షరాల వర్తిస్తాయి. దేశానికి స్వాతంత్య్రం లభించేనాటికే హైదరాబాద్ సకల వస తులు కల రాజధాని నగరం. శాసనసభా భవనం, ఉస్మాని యా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, విమా నాశ్రయం, కంటోన్మెంటు, విశాలమైన కార్యాలయాలు, అతిథి గృహాలు, చక్కని డ్రైనేజి వ్యవస్థ, నిరంతరం ఉచిత మంచినీటి సరఫరా వ్యవస్థ, సిమెంట్ రోడ్లు, డబుల్ డెక్కర్ బస్సులు, డీజిల్ రైలు, కారు వ్యవస్థ, రేడియో స్టేషన్, టంకశాల, ఆర్డినె న్స్ ఫ్యాక్టరీలు మొదలైన సౌకర్యాలు అప్పటికే ఏర్పాటై ఉన్నా యి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కూడా హైదరా బాద్ నగర విశిష్టతకు ముగ్ధులయ్యారు. పార్లమెంటు భవనం లేకపోవడం మినహా దేశరాజధాని కావడానికి హైదరాబాద్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సంవ త్సరానికి ఒకసారైన పార్లమెంటు సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని ఆయన సూచించారు. అది జరగకపో యినా అంబేద్కర్ సూచన మేరకే బొల్లారంలో రాష్ట్రపతి నిల యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
దక్షిణ భారతావనిలోని రెండు జంట నగరాలలో మొదటి ద్వయం ఎర్నాకుళం, కొచ్చిన్ కాగా, రెండో ద్వయం హైదరా బాద్, సికింద్రాబాద్. సముద్రం ఒక పాయగా వేంబనాడు పేరుతో ఎర్నాకుళం, కొచ్చిన్‌ల మధ్య పోతుండగా ఇక్కడ మానవనిర్మితమైన 'హూస్సేన్ సాగర్' అటు, ఇటు రెండు సుందరమైన నగరాలుగా హైదరాబాద్, సికింద్రాబాద్ రూపు దిద్దుకున్నాయి.
ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం అనంతరం జరిగినవి కావు కదా! ఇంతటి ఘనచరిత్ర కలిగిన హైదరాబాద్‌ను తామే అభి వృద్ధి చేశామని ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారు గొప్ప లు చెప్పుకోవడం హాస్యాస్పదం. వాస్తవం చెప్పాలంటే సమై క్య రాష్ట్రం ఏర్పడిన తరువాత వారిక్కడకు వచ్చింది హైదరా బాద్‌పై ప్రేమతో ఎంత మాత్రం కాదు. హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో చౌకగా భూములు కొని లాభపడాలనే వచ్చారు. భూములు కొని పరిశ్రమలు పెట్టారు. ప్రభుత్వం నుంచి రాయితీలు, సబ్సిడీలు గుంజి, ప్రయోజనం పొందా రు. ఆ పరిశ్రమలతో మాత్రం స్థానికులైన తెలంగాణ వారికి మొండిచెయ్యి చూపి తమ ప్రాంతం వారికే ఉద్యోగాలను ఇచ్చుకున్నారు. భూములు కబ్జా చేశారు. రియల్ ఎస్టేట్ వ్యా పారం చేసి కోట్లు గడించారు. కళ్లు చెదిరిపోయే భవంతులను నిర్మించుకుని హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం చూడండి అంటున్నారు! ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కొందరు పలు కుబడిగల వ్యక్తులు, అక్కడి నుంచి వచ్చిన అధికారులు కుమ్మ క్కయి సొసైటీలుగా ఏర్పడ్డారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూములను చౌకగా కైంకర్యం చేసుకున్నారు. విలువైన స్థలాల ను నామమాత్రమైన ధరకే ఆంధ్ర ముఖ్యమంత్రులు ఈ సొసై టీలకు ధారదత్తం చేశారు. పర్యావరణ సమతుల్యతను పట్టిం చుకోకుండా ఈ స్థలాల్లో విచ్చలవిడిగా నిర్మాణాలు చేసి హైద రాబాద్‌ను కాంక్రీట్ జనారణ్యంగా మార్చేశారు. ఇందువల్ల నగరంలో ఒకప్పుడు రాజ్యమేలిన పచ్చదనం జాడ ఇప్పుడు లేకుండా పోయింది. సాయంకాలం పిల్లతెమ్మెరలతో గిలిగిం తలు పెట్టే హూస్సేన్‌సాగర్ పరిశ్రమల కాలుష్యకాసారమై విష వాయువులను విరజిమ్ముతున్నది. 'అభివృద్ధి' అని దీనినే అంటారా?
ఇక హైదరాబాద్‌లో చిత్రపరిశ్రమ అభివృద్ధి జరిగిందనే వాదం కూడ ఒకటుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రా సు నుంచి తరలివచ్చింది హైదరాబాద్‌లోని విలువైన భూము ల కోసమే. ఈ పరిశ్రమ హైదరాబాద్‌కు రావడం వల్ల కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. మరాఠీయుల రాజధానియైన బొంబాయిలో హిందీ సినిమాలు తయారవుతుండగా తెలు గు సినిమాలు మద్రాసులో తయారుకావడంలో తప్పేమీ లేదు. మహరాష్ట్ర ప్రభుత్వం బొంబాయిలో ఒక్క సెంటు భూమి కూడ ఇవ్వకపోయినా, అక్కడ హిందీ చలనచిత్ర పరి శ్రమ అభివృద్ధి ఆగిపోలేదు. హిందీ రాష్ట్రాల రాజధానులైన లక్నో, భోపాల్, జైపూర్ నగరాలకు తరలిపోలేదు. తమ స్వార్థ ప్రయోజనాలకోసం ప్రభుత్వ భూములు పొంది భవంతులు, స్టూడియోలు నిర్మించుకోవడం, పరిశ్రమలను, వ్యాపారాలను నిర్వహించుకోవడం హైదరాబాద్‌ను ఉద్ధరించడమవుతుం దా? 1956లో హైదరాబాద్ దేశంలో ఐదవ పెద్ద నగరంగా ఉండేది. ఇప్పుడు ఆరవ పెద్ద నగరంగా ఉంది. దీన్ని బట్టి అర్థమయేదిమిటి. హైదరాబాద్ అభివృద్ధి చెందిందా? దిగ జారిపోయిందా? సమాధానం స్పష్టమే.
చండీగఢ్ మాదిరిగా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడా నికి హైదరాబాద్ భారత ప్రభుత్వం నిర్మించింది కాదు. అవి భక్త పంజాబ్ రాజధానియైన లాహోర్ 'రెడ్‌క్లిఫ్ అవార్డు' ప్రకా రం దేశ విభజన సమయంలో పాకిస్థాన్ అధీనంలో గల భాగానికి వెళ్ళింది. దీనితో తీవ్రంగా నష్టపోయినా పంజాబ్ ప్రాంతానికి కొత్త రాజధాని గా చండీగఢ్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. 1966లో రెండ వసారి పంజాబ్ విభజన జరిగి నప్పుడు ఆ నగరం ఉభయ రాష్ట్రాలకు చెందుతుందని కొత్త రాష్ట్రమైన హర్యానా వాదించింది. ఈ కారణం వలనే చండీ గఢ్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారి, పంజాబ్, హర్యానాలకు అనుసంధానమయింది. హైదరాబాద్ విషయానికి వస్తే అది తెలంగాణ ప్రజల రెక్కల కష్టంతో రక్తతర్పణతో ఆవిర్భవిం చింది. ప్రత్యేకరాష్ట్రం కావాలనే కోర్కె ఆంధ్రులలో అంకురించ డానికి శతాబ్దాల ముందే నిర్మితమైన నగరమని గుర్తుంచు కోవాలి.
మహారాష్ట్ర నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన గుజరాతీయులు బొంబాయిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కోరలేదు. రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం నుంచి కర్ణాటకకు మూడు జిల్లాలు, మహారాష్ట్రకు ఐదు జిల్లాలు బదిలీ అయ్యాయి. అప్పుడు కూడా వారెవరూ ఇలాంటి వితండవాదం చేయలేదు. తెలుగు మాట్లాడే వారందరికీ ఒకే రాష్ట్రం ఉండాలని పైకి ఎంతగా చెప్పుకున్నప్పటికీ కర్నూలు నుంచి రాజధానిని హైదరా బాద్‌కు మార్చడానికి ఇతర ముఖ్య కారణాలు కూడా ఉన్నా యి. విభజన తర్వాత కర్నూలులో తగిన వసతులు లేక ప్రభు త్వ కార్యాలయాలు చాలా భాగం మద్రాసులోనే ఉండిపో యాయి. అందువల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ అస్తవ్యస్త మైపోయింది. మద్రాసులో ఉన్న కార్యాలయాలకు అద్దె చెల్లిం చేందుకు ఆంధ్ర ప్రభుత్వానికి నిధుల కట కట ఏర్పడింది. కాబట్టి అన్ని వసతులు ఉన్న హైదరాబాద్‌ను రాజధానిగా సమైక్య రాష్ట్రం ఏర్పాటుకు మొగ్గుచూపారు. ఆంధ్ర అసెం బ్లీలో నీలం సంజీవరెడ్డి ప్రసంగాలు ఒకసారి చదివితే ఈ విష యాలు తేటతెల్లమవుతాయి.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత చాలామంది తెలుగు వారు మద్రాసులోనే ఉండిపోయారు. కేంద్ర పాలిత ప్రాంతం కాని బెంగుళూరు, బొంబాయిలలో కూడా లక్షల సంఖ్యలో తెలుగువారు నివసిస్తున్నారు. అందువల్ల దశాబ్దాలుగా ఇక్క డ ఉంటున్న ఆంధ్రులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెళ్లిపోవల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు 'స్వపరి పాలన'ను, 'ఆత్మగౌరవాన్ని' మాత్రమే కోరుకుంటున్నారు. ఆంధ్రులను దూరం చేసుకోవాలని అనుకోవడం లేదు. వారుం డాలనుకుంటే నిర్భయంగా ఉండిపోవచ్చు. తెలంగాణ భార త్‌లోనే అంతర్భాగంగా ఉంటుంది. వేరే దేశంగా ఉండాలని కోరుకోవడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండాలని కోరడం రెచ్చగొట్టే చర్యే కాకుం డా పగటికల కూడా. అది నెరవేరడం అసాధ్యం.
from andhra jyothy - వ్యాసకర్త మాజీ మంత్రి.

4 comments:

Unknown said...

Thank you verymuch for such a sweet and extraodinary blog

Hyderabadtelangana walladhi telangana walleke wutnthundhi
Telangana wallathone wundhali

Jai telangana Jai Jai telangana

Unknown said...

telangana gurundhi mana vallaki thelavakunda academics lo kuda petaledhu,thelavakunda inni rojulu mosam chesinaru.
Kani ippati kaina academics lo telagana charitra thelisetatuga telugu patalalo unte manchidhani na opinion.

Nrahamthulla said...

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు
ఏర్పడిన సంవత్సరం ↓ జిల్లా ↓ జిల్లాకేంద్రం ↓ జనాభా (2001) ↓ వైశాల్యం (km²) ↓ జనసాంధ్రత (/km²) ↓ జిల్లావెబ్ సైట్ ↓
1905 అదిలాబాద్ జిల్లా అదిలాబాద్ 2,479,347 16,105 154 http://adilabad. nic.in/
1881 అనంతపూర్ జిల్లా అనంతపూర్ 3,639,304 19,130 190 http://anantapur. nic.in/
1911 చిత్తూరు జిల్లా చిత్తూరు 3,735,202 15,152 247 http://chittoor. nic.in/
1802 తూర్పు గోదావరి జిల్లా కాకినాడ 4,872,622 10,807 451 http://eastgodavari .nic.in/
1794 గుంటూరు జిల్లా గుంటూరు 4,405,521 11,391 387 http://guntur. nic.in/
1978 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 3,686,460 217 16,988 http://hyderabad. nic.in/
1910 కడప జిల్లా కడప 2,573,481 15,359 168 http://kadapa. nic.in/
1905 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 3,477,079 11,823 294 http://karimnagar. nic.in/
1953 ఖమ్మం జిల్లా ఖమ్మం 2,565,412 16,029 160 http://khammam. nic.in/
1925 కృష్ణా జిల్లా మచిలీపట్నం 4,218,416 8,727 483 http://krishna. nic.in/
1949 కర్నూలు జిల్లా కర్నూలు 3,512,266 17,658 199 http://kurnool. nic.in/
1870 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 3,506,876 18,432 190 http://mahabubnagar .nic.in/
1956 మెదక్ జిల్లా సంగారెడ్డి 2,662,296 9,699 274 http://medak. nic.in/
1953 నల్గొండ జిల్లా నల్గొండ 3,238,449 14,240 227 http://nalgonda. nic.in/
1906 నెల్లూరు జిల్లా నెల్లూరు 2,659,661 13,076 203 http://nellore. nic.in/
1876 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 2,342,803 7,956 294 http://nizamabad. nic.in/
1970 ప్రకాశం జిల్లా ఒంగోలు 3,054,941 17,626 173 http://prakasam. nic.in/
1978 రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ 3,506,670 7,493 468 http://rangareddy. nic.in/
1950 శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం 2,528,491 5,837 433 http://srikakulam. nic.in/
1950 విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం 3,789,823 11,161 340 http://visakhapatna m.nic.in/
1979 విజయనగరం జిల్లా విజయనగరం 2,245,103 6,539 343 http://vizianagaram .nic.in/
1905 వరంగల్ జిల్లా వరంగల్ 3,231,174 12,846 252 http://warangal. nic.in/
1926 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు 3,796,144 7,742 490 http://wgodavari. nic.in/
విశేషాలు

* అనంతపురం జిల్లా కంటే వైశాల్యంలో చిన్న దేశాలు : మాల్టా,గ్రెనెడా,ఆండొర్రా,బహ్రైన్,బ్రూనే,కేప్వర్ద్,సైప్రస్,డొమినికా,ఫిజీ,గాంబియా,జమైకా,కువైట్,లెబనాన్,లక్సెంబర్గ్,మారిషస్,పోర్టోరికో,కతార్,సీషెల్స్,సింగపూర్,స్వాజీలాండ్,టాంగో.ట్రినిడాడ్,టుబాగో,వనౌటూ.

Unknown said...

Really grate information abt Hyderabad
jai telangana