Thursday, August 07, 2008

సత్యం పై దాడి - మా ఉనికి పై దాడి

మిత్రులారా..!

లాభాల్లో నడుస్తున్న ఒక బ్రాంచి ని ఆర్థిక లావాదేవీ లు నడుపుతున్న ఏ సంస్థ మూసివెయ్యడానికి ఇష్టపడదు. ఐతే రాష్ట్ర స్థాయి లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఈ బ్రాంచి ని ఒక ప్రైవేటు చిట్ ఫండ్ కంపెనీ మూసివేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.

తమిళనాడు కేంద్రం గా గల శ్రీరాం చిట్స్ కు ఇప్పుడున్న రాష్ట్రం లో ఆంధ్రా పెద్దలే పెద్దలుగా ఉన్నారు. అన్నీ కంపెనీల్లో లాగానే ఇక్కడా కూడా ఒకరొకరుగా పైకెగబాకి అన్ని పదవుల్లో తిష్ట వేసారు. ఇక్కడివరకు రొటీనే. ఆతర్వాతే కథ భిన్నం గా నడిచింది. ఇలా గద్దెనెక్కిన వారు 30 మంది సిబ్బంది & 10 మంది డెవలప్ మెంట్ అధికారులతో మొదట్నుంచి లాభాలతో నడుస్తున్న చిక్కడపల్లి బ్రాంచి ని మూసేద్దామనే నిర్ణయం తీసుకున్నారు. ఈ బ్రాంచి లోని మెజరిటీ ఉద్యోగులూ తెలంగాణ వాదులే. తెలంగాణ ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగుల సంఘం సభ్యులే. కొత్త కస్టమర్ల కోసం ప్రైవేటు కంపెనీలు రోజుకో స్కీము పెడుతున్న ఈ రోజుల్లో లాభాల్లో ఉన్న బ్రాంచి ని ఎందుకు మూస్తున్నారన్నదే ఎవరికీ అర్థం కాని ప్రశ్న. తమిళనాడులో ఉన్న కంపెనీ అధిపతులేమో చేరండి చేరండి అని జనాల్ని పిలుస్తుంటే ఇక్కది అంధ్రా అధికారులు మాత్రం తెలంగాణ వారు ఎక్కడెక్కడున్నారో వెతికి వెతికి మరీ ఆ బ్రాంచిల్ని మూసేస్తున్నారు. రాష్ట్రం లోనే మంచి ఫలితాలు సాధిస్తున్న ఈ బ్రాంచి ని మూసివేయడం ఈ పిచ్చి వారి పైత్యానికి మరో మచ్చుతునక.

ఇదే క్రమం లో అడగడానికి వెళ్లిన ఆ బ్రాంచి ఉద్యోగి, తెలంగాణ ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సత్యం పై ఎం డీ స్థాయి గూండాలు క్లోస్డ్ రూం లో దాడిచేయడం జరిగింది.

తెలంగాణ లోని లభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలకు నష్టాలు తెప్పించి మరీ మూసివేయడమె మనకు తెలుసు. NSF, azam jahi వంటి వందలాది కంపెనీల మూసివేత తో ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ లోకి వచ్చిన తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ చుక్కెదురైంది. తమ బందువులను కొలువుల్లోకెక్కించే ఆంధ్రులు అన్నింటా తెలంగాణ వారిని ద్వితీయ శ్రేని వారిగానే చూశారు. వాడు మారలేదు. వాడి దాడులూ ఆగలెదు. మారింది దాడుల తీరు మాత్రమే. నిన్న శ్రీరాం చిట్స్ లో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం.

ఆంధ్ర మథాన్ని నరనరాన జీర్ణించుకున్న కొందరు ఆంధ్రా అధికారులు సత్యం పై జరిపిన ఈ దాడిని తెలంగాణ ఐటి ఫోరం తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణ వాదాన్ని ఎదుర్కోలేని పిరికి పందలు తెలంగాణ వాదులపై దాడులు కొనసాగిస్తున్నారు. దాడులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరు. సత్యం గెలిచి తీరుతాడు. సత్యం జయించి తీరుతుంది.


naveen achari,
Telangana IT Forum

No comments: