Wednesday, August 27, 2008

తెలంగాణ చరిత్రకు అన్యాయం జరిగింది - పి. సత్యనారాయణ

నిజాం ఎందుకు క్రూరుడయ్యాడు? ఆయనను క్రూరుడుగా చేసిందెవరు? తెలంగాణ ప్రజల నెత్తురు తాగిందెవరు? నెత్తురు కార్చిందెవరు? తెలంగాణ పోరాటంలో పాల్గోని కీర్తి కిరీటాలు ధరించి అంతార్జాతీయ ఖ్యాతీ పొందిందెవరు? అసలు తెలంగాణ అప్పుడెట్ల తల్లడిల్లింది? ఇప్పుడెలా తల్లడిల్లుతుంది? 1948 సెప్టెంబర్ 17 న తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చినట్లు భావిస్తారు. కాని 1948 నుంచి 1951 వరకు ప్రజాస్వామ్య ముసుగులో కమ్యూనిస్టులు అణిచివేత పేరుతో తెలంగాణ ప్రాంతాన్ని మారణ హోమం చేసింది కాంగ్రేస్ ప్రభుత్వం కాదా! ప్రధానంగా నెహ్రూ, పటేల్‌ల నేతృత్వంలో జరిగిన దురాగతాలతో తెలంగాణ తల్లడిల్లింది. నిజాం నిరంకుశత్వం నుంచి కాంగ్రేస్ చేసిన రక్తపాతాన్ని మినహా యించి చూడడం చరిత్రకారులకు విజ్ఞత కాదు. ఇట్లా మాట్లాడితే మొత్తం నిజాం పాలనను సమర్దించినట్లు కాదు. నిజాం నవాబు చేసిన అకృత్యాలు ఎలాంటివో! కాంగ్రేస్‌జరిపించిన, జరిపిస్తున్న రక ్తపాతం ఎలాంటిదో తెలంగాణ ప్రజలకు తెలుసు. నవాబు హయంలో జరిగిన అభివృద్ధి పనులను చెప్పక పోవడం కొందరి దృష్టిలో చారిత్రక ద్రోహం కాకపోవచ్చు.

నిజాం కాలంలో స్త్రీలను చెరిచిన ఉదంతాలు దారుణమైనవి దానికి బలైనది తెలంగాణ. దాన్ని ఎదుర్కొన్నది తెలంగాణే. కమ్యూనిస్టులు అణిచివేత పేరుతో కాటూరు, ఎలమర్రెలో జరిగిన ఆకృత్యాలు చరిత్రకారులు లెక్కకట్టి చెప్పాలి. దానికి భాద్యులైనవారిని నిజాంతో పాటు ఎండగట్టాలి. తెలంగాణ ప్రాంతమంతా సాయుధ పోరాటంలో బలిదానాలు చేసింది. ఆ కుటుంబాల స్థూపాలు ప్రతి వూళ్ళలో కనిపిస్తాయి. నేటికి 60 ఏళ్ళు గడిచినా మీ ఆశయాలను కొనసాగిస్తాం కామ్రేడ్స్ అనడం తప్ప ఏ ఒక్కటైన ఇప్పటి వరకు సాధించగలిగారా? తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలన తర్వాత ఈ పాలక వర్గాలు ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళందించారో చెప్పాలి? నిజాం తవ్విన చెరువులే ఇప్పటికీ దిక్కని ఎవరైన మాట్లాడితే వాళ్ళు చారిత్రక ద్రోహులా? నిజాం రాజ్యంలో స్వాధీనం చేసుకున్న భూములు ఎంత మంది పేద, బీద వర్గాల చేతుల్లో ఉన్నాయి. ఆనాడు ఎర్రజెండా పేరుతో తమ ప్రాణాలను అర్పించిన కుటుంబాల పరిస్థితి దీనాతి దీనంగా వుంది. ఆ కుటుంబాలకు కనీసం పెన్షన్ కూడా లేదు.

నేటి పాలకులు, ఎత్తుగడల పేరుతో వాళ్లతో కలిసి గెలిచిన కమ్యూనిస్టులు చేస్తున్న పని ఏమిటి? కేవలం వ్రామిక వర్గమే తమ వూపిరి అని తపించే కమ్యూనిస్టులు వీరుల కుటుంబాలకు పెన్షన్ ఇప్పించుటలో ఎందుకు విఫలమవుతున్నారు? 1947-48 వరకు నిజాం సర్కారు కిందనే తెలంగాణ వుంది. 1948 సెప్టెంబరు తర్వాత భారత ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. 1948-49లో ఆంధ్రాలో కాంగ్రేస్ ప్రభుత్వం భీభత్సకాండను విచ్ఛల విడిగా ప్రయోగించినప్పుడు ఆత్మరక్షణకోసం ఎదురుదెబ్బ తీయవలసిందిగా కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది.(వీర తెలం గాణ విప్లవ పోరాటం - గుణపాఠాలు, పుచ్చలపల్లి సుందరయ్య పేజి నం 98)ఇలాంటి పిలుపులు తెలంగాణలో కోకొల్లలుగా వచ్చా యి. కె.సి.ఆర్ నిజాంకు సలాం చేస్తే అల్లకల్లోలమై పోతున్న వారు, ఆనాటి వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని రక్తసిత్తం చేసి 4,000 మందికి పైగా వీరులను బలిడొన్న రాకాసి కాంగ్రేస్ గురించి ఎందుకు మాట్లాడం లేదు. అది కాక, అలాంటి కాంగ్రేస్‌తో అలాయ్ బలా య్ తీసుకొని అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోను ఫ్రంటు కట్టిన వామపక్షీయులు నిజాం ఒక్కడే క్రూరుడని చెప్పటం చరిత్రకే వదిలె య్యాలి.

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖన్ సమాధి కె.సి.ఆర్ నమస్కరిస్తే వొంటికాలిపై కమ్యూనిస్టులు కాంగ్రేస్ చేసిన అరాచకా లపై నోరేందుకు విప్పరు. వారితో ఫ్రంటు ఎట్లా కడతారు. ఇలా కాంగ్రేస్‌తో కలిసి ఎన్నికల ఎత్తుగడల పొత్తు ప్రజా ఉద్యమాలకు ద్రోహం చేసినట్లు కాదా? నిజాం కాలంలో జరిగిన అభివృద్ధి పనులపై కె.సి.ఆర్. లేవదీసి చర్చతో తెలంగాణ చరిత్రను తిరగ రాయవలసి వుంది. అప్పటి వరకు వీరతెలంగాణ సాయుధ పోరా టానికి నేతృత్వం వహించిన వాళ్ళంతా తెలంగాణ ప్రాంతేతరులు కావడం, వీరే వీర తెలంగాణ చరిత్ర రాయటం వల్ల కూడా తెలం గాణ చరిత్రకు అన్యాయం జరిగింది. ఇకనైనా తెలంగాణేతరులు రాసింది కాకుండా మన తెలంగాణ చరిత్రను మనమే రాసుకుందాం. కె.సి.ఆర్. నిజంపై చర్చకు గేట్లెత్తడంతో అసలు తెలం గాణ చరిత్ర ఏమిటన్న అంశం ముందుకు వచ్చింది. మనకు తెలియని మన తెలం గాణ చరిత్రను రాసుకుందాం.మన సంస్క­ృతిని మనమే కాపాడు కుందాం. Andhra jyothy (12-11-2007)

No comments: